వెలిగల్లు ప్రాజెక్టు పేరును వైఎస్సార్ వెలిగల్లు రిజర్వాయరుగా మార్చిన ప్రభుత్వం

  • ఇక నుంచి దీనిని వెలిగల్లు ప్రాజెక్టుగా పిలవాలని ఉత్తర్వులు
  • సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రత్యేక వాహక సంస్థ ఏర్పాటు
  • ఎస్పీవీ ద్వారా రూ. 40 వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయం
కడప జిల్లాలోని వెలిగల్లు ప్రాజెక్టు పేరును వైఎస్సార్ వెలిగల్లు రిజర్వాయరుగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఈ ప్రాజెక్టును వైఎస్సార్ వెలిగల్లు ప్రాజెక్టుగా వ్యవహరించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రత్యేక  వాహక సంస్థను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఈ మేరకు అనుమతులు మంజూరు చేసింది.

రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టుల అభివృద్ధి సంస్థ పేరుతో ఎస్పీవీ ఏర్పాటు చేయాలని నిర్ణయించి జలవనరుల శాఖ నుంచి రూ. 5 కోట్ల పెట్టుబడి మంజూరుకు ఆదేశించింది. ఈ సంస్థ ద్వారా రూ. 40 వేల కోట్లను ఖర్చు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

Veligallu project
YSR Veligallu
Kadapa District
YS Jagan

More Telugu News